Posts

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

Image
కాకినాడ : సత్య చారిటబుల్ ట్రస్ట్, సత్య స్కాన్స్ అండ్ డయాగ్నస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం జూన్ 7న స్కాలర్‌షిప్ మెరిట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాదా వెంకటరమణ తెలిపారు. పదో తరగతిలో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్ష కేంద్రాల వివరాలను పరీక్షకు రెండు రోజుల ముందు విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. మొత్తం 60 బహుళ ఎంపిక ప్రశ్నలతో 140 మార్కులకు పరీక్ష ఉంటుందని వివరించారు. గణితంలో 20 ప్రశ్నలకు 40 మార్కులు, సైన్స్‌లో 20 ప్రశ్నలకు 40 మార్కులు, సాంఘిక శాస్త్రం మరియు సాధారణ జ్ఞానంలో 20 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించినట్లు తెలిపారు. పరీక్ష 10వ తరగతి సిలబస్‌తో పాటు సాధారణ జ్ఞానం ఆధారంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ముఖ్యమైన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవడంతో పాటు సమకాలీన అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప...

ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

Image
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్ ఐటీ (IIIT)లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును అధికారులు రేపటి వరకు పొడిగించారు. రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉండగా, ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) కోటా కింద అదనంగా 10 శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చే నెల రెండో వారంలో ప్రవేశ ఫలితాలను విడుదల చేసి, మూడు నుంచి నాలుగు వారాల వ్యవధిలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తిరుపతిలో ఎన్ఆర్ఐకి షాక్.. హోటల్ లాకర్‌లోని 1000 డాలర్లు మాయం

Image
తిరుపతి  : తిరుమల శ్రీవారి దర్శనానికి సింగపూర్ నుంచి కుటుంబంతో వచ్చిన ఓ ఎన్నారైకి తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారాసా సరోవరం హోటల్‌లోని రూమ్ నెంబర్ 1017లో బస చేసిన ఆర్ముగం కుటుంబం, శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి చూడగా లాకర్‌లో ఉంచిన 1000 అమెరికన్ డాలర్లు కనిపించలేదు. దీంతో బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నంబర్ 191/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసును అలిపిరి ఎస్‌ఐ దుర్గాప్రసాద్ విచారిస్తున్నారు.

అనపాల ఆంజనేయులు రెడ్డిని అభినందించిన సానా సతీష్ బాబు

Image
కాకినాడ :  సమాజ సేవను బాధ్యతగా భావిస్తూ సంవత్సరం పొడవునా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనపాల ఆంజనేయులు రెడ్డిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అభినందించారు. మండుటెండల్లో ప్రజలకు, పేదలకు, పాదచారులకు చల్లని తాగునీరు అందించడంతో పాటు మూగజీవాలైన పశువులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేకంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తూ విద్యకు ప్రోత్సాహం అందించడం ద్వారా సమాజంలో సేవా భావాన్ని చాటుతున్నారని కొనియాడారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు దూరంగా నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆంజనేయులు రెడ్డి సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని సానా సతీష్ బాబు అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువై సామాజిక కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

పుష్కరాలపై పవన్ ఫోకస్.. గోదావరిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దే మహాయజ్ఞం.. 268 పంచాయతీల్లో ప్రత్యేక ప్రణాళిక

Image
ఆంధ్రప్రదేశ్ : పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గోదావరి పుష్కరాల నిర్వహణలో చెత్త, కాలుష్య నియంత్రణకు నిపుణుల సూచనలు వినియోగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు ఉత్పత్తి అవుతున్న 7,200 టన్నుల పొడి చెత్తను సమర్థంగా వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన అవసరాలను తీర్చవచ్చని పేర్కొన్నారు. పుష్కరాలకు సంబంధించిన 268 పంచాయతీల్లో ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించి చెత్త నిర్వహణపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. చెత్తను వేరు చేసే విధానంలో గ్రామాల నుంచి నగరాల వరకు మార్పు తీసుకురావాలని, డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో మరో ఆరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, కాకినాడలో ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇండోర్ నగర చెత్త నిర్వహణ విధానం ఆదర్శమని పేర్కొంటూ, చెత్తను సంపదగా మార్చే విధానాలతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

సముద్ర తాబేళ్ల సంరక్షణకు ‘టెడ్’ పరికరాలు కీలకం – ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ

Image
కాకినాడ : సముద్ర జీవవైవిధ్య పరిరక్షణతో పాటు మత్స్య సంపద పెంపుదలకు టర్టిల్ ఎక్స్‌క్లూడర్ పరికరాలు (టెడ్) ఎంతో ఉపయోగపడతాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక శిక్షణ, పరిశోధన సంస్థలో శనివారం యాంత్రిక పడవల యజమానులకు టర్టిల్ ఎక్స్‌క్లూడర్ పరికరాలపై శిక్షణ, పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మత్స్యకారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ సుస్థిరమైన, బాధ్యతాయుతమైన చేపల వేటను ప్రోత్సహించాలని సూచించారు. ట్రాలింగ్ చేపట్టే పడవలకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా టెడ్ పరికరాలను అమర్చుకోవాలని, దీనివల్ల సముద్ర తాబేళ్ల రక్షణతో పాటు సముద్ర పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని తెలిపారు. పర్యావరణహితమైన వేట విధానాలు చేపట్టడం ద్వారా భవిష్యత్ తరాలకు సమృద్ధిగా మత్స్య సంపద అందుబాటులో ఉంటుందన్నారు. ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా ఈ పరికరాలను అందిస్తోందని, మత్స్యకారులు వాటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి. కృష్ణారావు మాట్లాడుతూ యాంత్రిక పడవలకు టెడ్ పరికరాలు అమర్చడం తప్...

ఉపాధి సృష్టికి పరిశ్రమలే శక్తి.. యువతకు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పిలుపు

Image
కాకినాడ : రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ సహకారంతో, పనిముట్ల రూపకల్పన కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపార సంస్థల అభివృద్ధి అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలకు వ్యాపార విస్తరణ అవకాశాలు, ఉత్పత్తుల నాణ్యత మెరుగుదల, మార్కెట్ అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై సమగ్ర అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కొత్త పరిశ్రమలను స్థాపించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె సూచించారు. చిన్న పరిశ్రమలు బలమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివని, సాధికారత పొందిన పారిశ్రామికవేత్తలే సుసంపన్న సమాజ నిర్మాణానికి పునాది వేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.