అమరావతి : ఒడిశా వైపు నుంచి శ్రీకాకుళం జిల్లాను తాకిన ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ వ్యవస్థ సముద్రంలో మరింత బలపడిన నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలపై హెచ్చరికలు జారీ చేశాయి. ఈ అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెల్లవారుజామున నెల్లూరు, తిరుపతి సహా దక్షిణ కోస్తా జిల్లాలకు వర్షాలు విస్తరించే అవకాశముందని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల పరిస్థితులు నమోదవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, మత్స్యకారులు సముద్ర పరిస్థితులపై అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
కాకినాడ : సత్య చారిటబుల్ ట్రస్ట్, సత్య స్కాన్స్ అండ్ డయాగ్నస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, గురుకుల పాఠశాలల విద్యార్థుల కోసం జూన్ 7న స్కాలర్షిప్ మెరిట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాదా వెంకటరమణ తెలిపారు. పదో తరగతిలో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్ష కేంద్రాల వివరాలను పరీక్షకు రెండు రోజుల ముందు విద్యార్థులకు తెలియజేస్తామని చెప్పారు. మొత్తం 60 బహుళ ఎంపిక ప్రశ్నలతో 140 మార్కులకు పరీక్ష ఉంటుందని వివరించారు. గణితంలో 20 ప్రశ్నలకు 40 మార్కులు, సైన్స్లో 20 ప్రశ్నలకు 40 మార్కులు, సాంఘిక శాస్త్రం మరియు సాధారణ జ్ఞానంలో 20 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయించినట్లు తెలిపారు. పరీక్ష 10వ తరగతి సిలబస్తో పాటు సాధారణ జ్ఞానం ఆధారంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ముఖ్యమైన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవడంతో పాటు సమకాలీన అంశాలపై కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప...
కాకినాడ : మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హయాంలో కాకినాడ నగరం డ్రగ్స్, గంజాయి, రౌడీయిజం, అక్రమాలకు కేంద్రంగా మారిందని, ప్రస్తుతం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) నాయకత్వంలో నగరం అభివృద్ధి, ప్రశాంతత దిశగా పయనిస్తోందని కాకినాడ నగర టీడీపీ నాయకులు ఆరోపించారు. ఇటీవల వైసీపీకి చెందిన 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మల్లా కిషోర్ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ శుక్రవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, డివిజన్ ఇంచార్జి పిర్ల లక్ష్మీప్రసన్న మీడియాతో మాట్లాడారు. మల్లా కిషోర్ చదువుకున్న విద్యాసంస్థల వద్ద అక్రమ మట్టిపనులు జరిగాయని, కొంతమంది అనుచరుల ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించారన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారాలు వెలుగుచూశాయని ఆరోపించారు. కొండబాబు హయాంలో నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ద్వారా సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఏర్పాటు చేసి శాంతిభద్రతలు మెరుగుపరిచారని తెలిపారు. ద్వారంపూడి పాలనలో నేరాలు పెరిగాయని, ప్రజలు విసిగిపోయి ఇప్పుడు వనమాడిని ఆదర...
Comments
Post a Comment