పుష్కరాలపై పవన్ ఫోకస్.. గోదావరిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దే మహాయజ్ఞం.. 268 పంచాయతీల్లో ప్రత్యేక ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్ : పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గోదావరి పుష్కరాల నిర్వహణలో చెత్త, కాలుష్య నియంత్రణకు నిపుణుల సూచనలు వినియోగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు ఉత్పత్తి అవుతున్న 7,200 టన్నుల పొడి చెత్తను సమర్థంగా వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన అవసరాలను తీర్చవచ్చని పేర్కొన్నారు. పుష్కరాలకు సంబంధించిన 268 పంచాయతీల్లో ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించి చెత్త నిర్వహణపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. చెత్తను వేరు చేసే విధానంలో గ్రామాల నుంచి నగరాల వరకు మార్పు తీసుకురావాలని, డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. రాష్ట్రంలో మరో ఆరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, కాకినాడలో ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇండోర్ నగర చెత్త నిర్వహణ విధానం ఆదర్శమని పేర్కొంటూ, చెత్తను సంపదగా మార్చే విధానాలతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు