ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్ ఐటీ (IIIT)లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును అధికారులు రేపటి వరకు పొడిగించారు. రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉండగా, ఆర్థికంగా బలహీన వర్గాల (EWS) కోటా కింద అదనంగా 10 శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చే నెల రెండో వారంలో ప్రవేశ ఫలితాలను విడుదల చేసి, మూడు నుంచి నాలుగు వారాల వ్యవధిలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...