పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో జనసైనికులు...

పిఠాపురం రూరల్: సమాజానికి సేవ చేయడమే నిజమైన రాజకీయమనే సిద్ధాంతంతో మల్లాం గ్రామంలో జనసేన నాయకులు బుర్రా విజయ్, కంద అప్పలరాజు ఏనుగు తాతాజీ ముందుకు వచ్చారు. తమ సొంత ఖర్చులతో గ్రామానికి చెందిన రెండు నిరుపేద కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేదల కోసం చేస్తున్న సేవలు తమకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు చేయూతనివ్వడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో స్థిరపడిన వారు ఒక్కో పేద కుటుంబానికి అండగా నిలిస్తే పేదరికాన్ని త్వరగా తరిమికొట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సేవా కార్యక్రమాలను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా, రాబోయే రోజుల్లో మరిన్ని కుటుంబాలకు విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాం గ్రామ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ యాండ్రపు శ్రీనివాస్ వార్డ్ ఇంచార్జ్ చామండి సునీల్ పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...