గొల్లప్రోలు నూతన కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నాయకుల


గొల్లప్రోలు: గొల్లప్రోలు మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన దివిజ సంపతిని సోమవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న పారిశుధ్య సమస్యలు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల వంటి ప్రజా సమస్యలపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. నూతన కమిషనర్ సమర్థవంతమైన నాయకత్వంలో గొల్లప్రోలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన బీజేపీ నాయకులు, ప్రజా సమస్యల పరిష్కారంలో తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. కమిషనర్ దివిజ సంపతి సానుకూలంగా స్పందిస్తూ, ప్రజల సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మలిరెడ్డి నారాయణరావు, కర్రీ సత్యనారాయణ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...