నేటి నుండి 31 వరకు ప్రమాద రహిత వారోత్సవాలు
కాకినాడ :ఏపీఎస్ ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రమాద రహిత వారోత్సవాలు శనివారం నుంచి 31వ తేదీ వరకు జిల్లా లోని కాకినాడ,ఏలేశ్వరం, తుని డిపో లలో జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎంయువి.మనోహర్ తెలియజేశారు. వారం రోజులపాటు డ్రైవర్ల అందరికీ ఆరోగ్య పరీక్షలు,రహదారి భద్రతా నియమాలపై శిక్షణా తరగతులు , ఉత్తమ డ్రైవర్స్ కు ప్రశంసా పత్రాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు.

Comments
Post a Comment