గోదావరి కాలువలోకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. డ్రైవర్కు స్వల్ప గాయాలు
కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట సమీపంలో సోమవారం టిప్పర్ లారీ అదుపు తప్పి గోదావరి కాలువలోకి దూసుకెళ్లింది. వేట్లపాలెం–మేడపాడు మార్గం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments
Post a Comment