చంద్రబాబు దగాకు వారంటీ.. హామీలకు గ్యారంటీ లేదన్న వైఎస్సార్‌సీపీ నేత నాగమణి

కాకినాడ రూరల్ : కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన ప్రజలను నిరాశపరిచిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె, సూపర్ సిక్స్ పథకాలు సహా అనేక హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ‘తల్లికి వందనం’ నిధులు ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదని పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన రెండేళ్ల పాలన సభలో ప్రభుత్వం సాధించిన విజయాల కంటే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పేర్లు మార్చడం తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు కొత్తగా అందించిన ప్రయోజనాలు కనిపించడం లేదని విమర్శించారు.

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రుణాలు, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలపై ప్రభుత్వం స్పందించడం లేదని నాగమణి పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందని, ప్రభుత్వం మాత్రం జగన్ పేరును ప్రస్తావిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

ప్రజలను ఎప్పటికీ మోసం చేయడం సాధ్యం కాదని, రానున్న రోజుల్లో మహిళా శక్తి తన సత్తా చాటుతుందని నాగమణి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Comments

Popular posts from this blog

ఏపీకి వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్రలో భారీ వర్షాల ముప్పు

ప్రతిభకు ప్రోత్సాహం.. జూన్ 7న స్కాలర్‌షిప్ కోసం సత్య ట్రస్ట్ పరీక్ష

ద్వారంపూడి హయాంలో కాకినాడ అరాచకాలకు నిలయం: టీడీపీ నేతలు