మరణించిన కార్యకర్త కుటుంబానికి టీడీపీ అండ.. బాబి నాయకత్వంలో 5 లక్షల బీమా క్లెయిమ్
కాకినాడ రూరల్ నియోజకవర్గం : తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్త కుటుంబానికి పార్టీ అధిష్టానం భరోసాగా నిలిచింది. కరప మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త త్రిమూర్తులు మేనవల్లి అకాల మరణంతో విషాదంలో ఉన్న కుటుంబానికి సభ్యత్వ బీమా ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందింది. ఈ మొత్తాన్ని మృతుడి నామినీ వీరరాఘవలు మేనవల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గ కో-కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ (బాబి) తెలిపారు.
పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను ఎన్నటికీ మరచిపోమని, వారి కుటుంబాలకు అండగా నిలవడం తెలుగుదేశం పార్టీ బాధ్యత అని బాబి పేర్కొన్నారు. కష్టకాలంలో ఈ బీమా సొమ్ము కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోందని, వారి సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ భాగస్వామ్యం అవుతుందని చెప్పారు.
బీమా క్లెయిమ్ సకాలంలో అందడంతో బాధిత కుటుంబ సభ్యులు పార్టీ అధిష్టానానికి, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, కటకంశెట్టి బాబికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments
Post a Comment