ఏకాదశి సందర్భంగా సర్పవరంలో దశ హారతులు
సర్పవరం : శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ఈ నెల 26వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు స్వామివారికి దశ హారతులు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు తెలిపారు. ఏకాదశి పూజ కట్టిన భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి హారతులను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.

Comments
Post a Comment