ముమ్మిడివరం టీడీపీ పరిశీలకురాలిగా సుంకర పావని నియామకం

కాకినాడ : తెలుగుదేశం పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుని ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ పరిశీలకురాలిగా మాజీ మేయర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్‌ను నియమించింది. గతంలో తుని నియోజకవర్గ పరిశీలకురాలిగా బాధ్యతలు నిర్వహించిన ఆమెకు పార్టీ వ్యవహారాల్లో విశేష అనుభవం ఉంది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నియామకంపై స్థానిక టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...