సామర్లకోట ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
కాకినాడ : సామర్లకోట బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడకు చెందిన ఇద్దరు మృతి చెందడం పట్ల ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Comments
Post a Comment