గౌతమి సిటిజన్స్ వ్యవహారం.. డిపాజిట్ దారులు హాజరుకావాలని ఆదేశం

కాకినాడ : కాకినాడలోని గౌతమి సిటిజన్స్ పరస్పర సహాయ సహకార మరియు పొదుపు సంఘం వ్యవహారాలపై ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల కమిషనర్ మరియు మ్యాక్స్ రిజిస్ట్రార్, గుంటూరు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.  జన్మభూమి పార్క్ ఎదురుగా ఉన్న సంఘానికి సంబంధించిన లావాదేవీలపై విచారణ చేపడుతున్న నేపథ్యంలో, సంఘంలో పొదుపులు చేసిన డిపాజిట్ దారులు తమ ఒరిజినల్ ఎఫ్‌డీ రసీదులు మరియు రెండు జిరాక్స్ కాపీలతో ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్‌లోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్న డివిజనల్ సహకార అధికారి కార్యాలయంలో ఈ నెల 29, 30 తేదీలలో విచారణ అధికారి ఎదుట హాజరై తమ వాంగ్మూలాలు సమర్పించాలని అధికారులు సూచించారు.

Comments

Popular posts from this blog

కాకినాడ తీరంలో సినీ సందడి.. ‘గర్భసంద్రం’ షూటింగ్ ప్రారంభం

ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి......... సీఐటీయూ

కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన...