గోదావరి పుష్కరాలను దేశం మాట్లాడుకునేలా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రాజమహేంద్రవరం : దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునేలా గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రానున్న ఏడాది కాలంలో పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఉభయగోదావరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. పుష్కరాల సందర్భంగా పరిశుభ్రత, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments
Post a Comment