ఏపీలో మరో 10 విమానాశ్రయాలు.. రాష్ట్రంలో విమానయాన రంగానికి భారీ ఊపు
ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న 6 విమానాశ్రయాలకు తోడు మరో 10 కొత్త ఎయిర్పోర్టులను నిర్మించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దగదర్తి, కుప్పం, అమరావతి, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, ఒంగోలు, అనంతపురం, తుని-అన్నవరం ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. మరో ప్రాంతం ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక దృష్టితో అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుందని తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

Comments
Post a Comment